Showing posts with label భక్తి. Show all posts
Showing posts with label భక్తి. Show all posts

Tuesday 17 January 2017

ఆలయాల్లో... అందుకే...  జ్వాలాతోరణం

అద్వైతసిద్ధికి, అమరత్వ లబ్ధికి అసలైన విలాసం కార్తికం. చాంద్రమానం ప్రకారం సంవత్సరంలోని ఎనిమిదో మాసంగా కార్తికం మానవాళికి కొంగుబంగారం. సకల చరాచర జగత్తును వృద్ధి చేసే లక్ష్మీపతి, లయం చేసే శంకరుడు - ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయమిది. శివకేశవులు అభేదమనే నినాదం... పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం... ఆరోగ్య సూత్రాలు పంచివ్వగల దివ్యసందేశం.. కార్తికం నిండుగా అల్లుకున్నాయి. అందుకే  ఏ మాసానికీలేని ప్రత్యేకత దీనికే సొంతం.
శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు కార్తికం గొప్పవరం. పున్నమి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు గనుకే దీనికి కార్తికమాసం అని పేరొచ్చింది. కార్తికంలో శివుడు సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన్య ముఖాలుగా ఉదయసంధ్య నుంచి ప్రదోష కాలం వరకూ 5 రూపాలతో భక్తుల్ని అనుగ్ర హిస్తాడు - బోళాశంకరుడు.
పున్నమినాడు జ్వాలాతోరణం
కార్తికమాసంలో పున్నమినాడు శివాలయాలలో జ్వాలా తోరణోత్సవాన్ని నిర్వహించడం ఆచారం. ఇలా మండుతున్న జ్వాలాతోరణం కింది నుంచి భక్తులు ఆనందోత్సాహాలతో పరుగు పెడతారు. ఇలా చేయడం వల్ల సకల పాపాలూ నివారణ అవుతాయని విశ్వాసం.
జ్వాలాతోరణం ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. క్షీరసాగరమథన సమయంలో ముందుగా హాలాహలం వెలువడుతుంది. లోకాలనన్నింటినీ కబళించేలా ఆ హాలాహలం శరవేగంతో దూసుకుపోతుండడంతో దానిని ఉండగా చేసుకుని శివుడు మింగబోతాడు. అయితే దాన్ని తాను మింగితే ఉదరంలో ఉన్న లోకాలన్నీ నశిస్తాయి కాబట్టి కంఠంలోనే ఉంచుకుంటాడు. అందుకే ఆయన నీలకంఠుడు, గరళకంఠుడు అయ్యాడు. అయితే పతి ఎంత శక్తిమంతుడైనప్పటికీ, సతికి తన భర్తకు ఏమైనా హాని కలుగుతుందేమోననే బాధే కాబట్టి పార్వతీ దేవి ఆ విషం తాలూకు వేడిబాధలను చల్లార్చమని అగ్నిదేవుణ్ణి ఆరాధించింది. తన జ్వాలలు పరమేశ్వరుడికి ఏ మాత్రం బాధ కలిగించకుండా అగ్నిదేవుడు చల్లారిపోయాడు. అందుకు ప్రతీకగా పార్వతీదేవి అగ్ని స్వభావం గల కృత్తికా నక్షత్రానికి సంకేతమైన కార్తిక మాసంలో పౌర్ణమినాడు జ్వాలాతోరణం ఏర్పాటు చేసి, దాన్ని భర్తతో కలిసి తాను దాటింది. ఆ మంటల నుంచి ఉపశమనం కలిగించడానికే శివుణ్ణి మనం నీటితోనూ, పంచామృతాలతోనూ అభిషేకిస్తుంటాం.
మరో కథనం మేరకు శివుడి రేతస్సును అగ్నిదేవుడు భరించలేక, గంగానదిలో పడవేస్తాడు. దాన్ని గంగ కూడా భరించలేక, ఒడ్డున ఉన్న రెల్లు గడ్డిలో వదిలింది. ఆ రేతస్సు నుంచి కుమారస్వామి జన్మించి, శరవణ భవుడయ్యాడు. శివుడికి పుట్టిన కుమారుడి చేతిలో తప్ప ఇతరులెవరి చేతిలోనూ మరణం సంభవించకుండా వరం పొందిన తారకాసురుడు ఇది తెలుసుకుని, ముందు జాగ్రత్తగా ఆ రెల్లు వనాన్ని అంతా తగులబెట్టించాడు. అయితే కుమారస్వామికి ఏ హానీ జరగలేదు. కారణజన్ముడైన కుమారస్వామిని అగ్ని ఏమీ చేయకుండా సురక్షితంగా ఉంచాడు. దానికి గుర్తుగా శివాలయాలలో కుమారస్వామి జన్మనక్షత్రమైన కృత్తికా నక్షత్రం వస్తుంది కాబట్టి కార్తిక పున్నమినాడు జ్వాలాతోరణం జరుపుతారు. జ్వాలాతోరణం నుంచి మూడుసార్లు వెళితే మహాపాపాలు హరిస్తాయనీ, గ్రహాల అననుకూలతలు తొలగి, భగవంతుని అనుగ్రహం లభిస్తుందనీ భక్తుల విశ్వాసం. గౌరీశంకరుల పల్లకి జ్వాలా తోరణం కింది నుంచి మూడుసార్లు వెళ్లిన తరువాత ఆ తోరణానికి మిగిలిన ఎండుగడ్డిని, సగం కాలిన గడ్డిని కూడా రైతులు గడ్డివాములలో కలుపుతారు. ఆ వాములలోని గడ్డిని మేసిన పశుసంతతి బాగా అభివృద్ధి చెందుతుందనీ, ధాన్యానికి లోటుండదనీ నమ్మకం.
శివకేశవుల చిత్తాన్ని గెలిచే ఉపాయం
కార్తికదీపం పేరిట ఈ మాసంలో వెలిగించే ప్రతీ జ్యోతీ అజ్ఞాన తిమిరాలను ఆవలకు నెట్టి, విజ్ఞాన రేఖలను విరబూయిస్తుంది. ఈమాసంలో ప్రతిరోజూ దీపం వెలిగించడం మోక్షప్రదం. ముత్తయిదువలంతా కార్తిక దీపాలతో తమ కుటుంబాల్లో వెలుగు నింపే పుణ్యకాలమిది. ఈ దీపాల్ని కృత్తికా నక్షత్రానికి ప్రతీకలుగా భక్తులు తలుస్తారు. శివాలయాల్లో ఆకాశదీపాలు, కార్తిక శుక్లపక్ష పున్నమి నాటి జ్వాలాతోరణాలు దర్శిస్తే జన్మజన్మల పాపాలు పటాపంచలవుతాయని ‘కార్తిక పురాణం’ చెబుతోంది. కార్తికమాసంలో తమిళనాడులోని అరుణాచలంలో కొన్ని వందల టన్నుల ఆవునేతిలో, లేదంటే నువ్వులనూనెలో కొన్ని వందల బేళ్ల పత్తిని, నూలు వస్త్రాలను తడిపి అరుణగిరిపై వెలిగించే దీపానికే కార్తీక జ్యోతి అని పేరు. ఈ జ్యోతి కొన్ని రోజులపాటు వెలుగుతూ గిరిప్రదక్షిణ చేసేవారికి దారి చూపుతుంది. ఈ కమనీయ దృశ్యం చూడడం కోసమే చాలామంది కార్తికపున్నమికి అరుణాచలంలో గిరిప్రదక్షిణ చేస్తుంటారు.
కార్తిక పున్నమి నాడు ఏం చేయాలి?
చాంద్రమానాన్ని అనుసరించి, ఏ మాసంలోనైనా ఆ మాసపు సంపూర్ణ శక్తి, మహత్తు పున్నమి నాడు ఉంటాయి. కాబట్టి, ఆ మాసమంతా చేయలేకపోయినా, కనీసం పున్నమినాడు సదాచారాన్ని పాటిస్తే మాసమంతా చేసిన ఫలం లభిస్తుందని పెద్దలు చెబుతారు. కార్తీకమాసంలో పౌర్ణమినాడు ప్రాతఃకాలానే లేచి, సముద్రం, నది, కాలువ, మడుగు, ఏరు, బావి, లేదా అందుబాటులో ఉన్న కుళాయి నీటిలో అయినా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, దీపారాధన చేసి, పగలంతా ఉపవాసం ఉండి, సాయంత్రం శివాలయానికి వెళ్లి, 365 వత్తులతో దీపారాధన చేసి, రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది. స్నాన, దాన, దీప, అర్చన, ఉపవాస, ఆరాధన, అభిషేక విధులనేవి దేనికది ఫలప్రదం కాబట్టి కనీసం మనం చేయగలిగే కొన్నింటినైనా ఎంచుకుని, వాటిని నిష్ఠగా ఆచరించడం వల్ల కూడా పరమేశ్వరానుగ్రహానికి నోచుకోవచ్చు.
-

కార్తీకపౌర్ణమి నాడు ఏంచేయాలి?

          సమస్త ప్రాణులకూ నేను మహోపకారం చేయగలను కార్తీకపౌర్ణమి నాడు. ఇతర ప్రాణులు చెయ్యలేవు. నేను ఏమి చెయ్యగలను? దీపం తీసుకెళ్ళి ఓ గదిలో పెట్టాననుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టాననుకోండి విశేష ఫలితం. యధార్ధానికి శాస్త్రంలో ఏమి చెప్పారంటే ఆ రోజున వీధులలో ఉన్న చెత్త కూడా వెలిగించాలి. కానీ లౌకికాగ్నితో వెలిగించకూడదు. మీ ఇంట దీపం వెలిగించి కార్తీక పౌర్ణమి నాటి ప్రదోషవేళ, "దామోదరమావాహయామి" అనిగాని, "త్రయంబకమావాహయామి" అనిగాని అని, ఆ దీపంతో వెలిగించాలి. ఈ దీపం పెట్టి ఒక్కసారి ఆకాశం వంక చూసి ఈ శ్లోకం చెప్పాలి...

"కీటాఃపతంగా మశకా శ్చ వృక్షాః
జటేస్ధలే... ఫలే ఏ నివసంతి
జీవా దృష్ట్వాప్రదీపం నచ జన్మ భాగినః
భవతింత్వ స్వపచాహి విప్రాః"
(ఈ దీపము దీపము కాదు, ఇది త్రయంబకుడు, ఇది దామోదరుడు. కాబట్టి ఈ దీపం వలన మొదటి ఫలితం ఎవరికి వెళ్ళాలంటే కీటకములు, పురుగులు, పతంగాలు, దోమలు, వృక్షాలకు వెళ్ళాలి. కాబట్టి ఈశ్వరా! నీ దీపపు వెలుతురు ఆ చెట్టు మీద పడుతుంది. కాబట్టి దామోదరుడి చెయ్యి దానిమీద పడినట్టే! త్రయంబకుని చెయ్యి దానిమీద పడినట్టే! అది అభ్యున్నతిని పొందాలి. నీటిలో ఉండే చేపలు, కప్పలు, తాబేళ్ళ వంటి వాటిపై ఈ దీపపు వెలుతురు పడినప్పుడు, ఆ ప్రాణులన్నీ కూడా నీ అనుగ్రహాన్ని పొందాలి. అక్కడితో వాటి పాపపుణ్యాలన్నీ నశించుపోవుగాక! ఇక వాటికి జన్మ లేకుండుగాక! ఉదర పోషణార్ధమే బ్రతుకుతున్న భయంకరమైన స్ధితిలో ఉన్న వాడిమీద ఈ దీపము యొక్క కాంతి ప్రసరించి వాడు వచ్చే జన్మలో అభ్యున్నతిని పొందుగాక!) నువ్వు ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేస్తే పరమేశ్వరుడు ఎంతో ఆనందాన్ని పొందుతాడు.
       మనం ఒక ఇల్లు కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్కరోజు ఉండకూడదు. 365 రోజులూ దీపాలు వెలుగుతూ ఉండాలి. అలా దీపం వెలగకపోతే ఆ దోషం మీకే వస్తుంది. మళ్లీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడిన అద్భుతమైన తిధి "కార్తీక పౌర్ణమి". అందుకే కార్తీకపౌర్ణమి నాడు 365 వత్తులు గుత్తిదీపం ఆవునేతిలో ముంచి వెలిగిస్తుంటారు.
      దీపాలు ఇంటి యజమాని వెలిగించాలి. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టి.వి చూస్తాను అనకూడదు. యజమాని పంచె కట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించాలి. ఇంట దీపం పెడితే కార్తీకపౌర్ణమి తిధి ప్రధానం. దేవాలయంలో దీపం పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం.

                   -

"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"
"ఓం నమఃశివాయ"

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు?

హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలు వున్నారని అంటారు. ఇంతమంది దేవతలు ఎందుకు?
ముక్కోటి దేవతలలో కోటి అనే శబ్దాన్ని సంఖ్యగా భావించవచ్చు లేక సమూహమని కూడా గ్రహించవచ్చు. సమూహమంటే ఒక గ్రూప్ అని అర్థం. మూడు కోట్లు అంటే మూడు వర్గాలు. అందులో సృష్టి అనే వర్గానికి బ్రహ్మ, స్థితి అనే వర్గానికి విష్ణువు, లయము అనే వర్గానికి ఈశ్వరుడు అధిష్ఠాన దేవతలు.

ఇది గాక మూడు కోట్లను సంఖ్యా పరంగా తీసికొంటే అసంఖ్యాకమైన దేవతాగణం మనలను ప్రతి కోణం నుండి నిరంతరం సంరక్షిస్తున్నారనీ చెప్పబడింది. ఒక రాజ్యంలో రకరకాల విభాగాలు వుంటాయి. ఒక్కొక్క విభాగంలో క్రింది స్థాయి నుండి పై స్థాయి వరకూ వివిధ ఉద్యోగస్థులుంటారు. అలానే సృష్టికర్తగా బ్రహ్మ, అతని అనుగ్రహంతో ప్రజాపతి, అశ్వనీ దేవతలు, విశ్వకర్మ, మొదలగు వారంతా సృష్టిక్రమానికి ఉపయోగపడే దేవతలు. అలాగే స్థితి అనే క్రియలో విష్ణువుతో పాటు ద్వాదశాదిత్యులు, ఇంద్రాది దేవతలు, కుబేరుల వంటి యక్షులు, లయము అనే క్రియకు పరమేశ్వరునితో పాటు ఏకాదశ రుద్రులు, రుద్రగణాలు, యమాది ప్రాణాంతక గణాలుంటారు.

దైవము అంటే దివ్యత్వము కలిగిన వారని అర్థం. అంటే వారికి మనవలె భౌతికంగా కనిపించే రూపాలు వుండవు. వారు దివ్యమైన శక్తి సంపన్నులు. ఆ శక్తుల ద్వారా సృష్టిలోని సమస్తాన్ని రక్షించడమే వారి కర్తవ్యం. సరస్వతీ దేవి వాక్కుకి అధిష్ఠాన దేవతయై వాక్కుని, సమస్త వాఙ్మయాన్ని రక్షిస్తుంది. లక్ష్మీ దేవి సంపదకు, పార్వతీదేవి సౌభాగ్యానికి అధిదేవతలు. కాబట్టి ఇంతమంది దేవతలా అనుకునే బదులు ప్రకృతిలో ఉన్న ఒక్కొక్క విభాగానికీ ఒక్కొక్కరినీ అధిష్ఠాన దేవతలుగా భావించి ఆరాధించడం మే సనాతన ధర్మం యొక్క విశిష్టత.

ఇక మరి కొంతమంది ముప్పైమూడు కోట్ల దేవతలను పూజిస్తారని అసలు ఇంత మంది దేవుళ్ళు ఉండరని దేవుడు ఒక్కడే అని మనకే ఏదో గొప్ప విషయం చెప్పేసినట్టు పాశ్చాత్య మతాల వారు ఫోజులు కొడతారు.
ఆ విషయం మనకి కూడ తెలుసు దేవుడు ఒక్కడే.. ఆయన సర్వాంతర్యామి అని. మరి ఈ ముప్పె ముడు కోట్ల మంది ఎవరు??
సంస్కృతం లో ఒక్కో పదానికి చాల అర్థాలు ఉంటాయి. అవి అక్కడ ఉన్న భావం ని వచ్చే అర్థాన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్ప మనకి తెలిసినదే సరైన అర్థమని భావి పరిగణలోకి తీసుకుంటే అర్థం మారుతుంది. ఆ విషయం తెలియక కోటి అంటే అదేదో సంఖ్య గా బావించి అలా మూర్ఖంగా మాట్లాడతారు అన్యమతస్తులు. కోటి అంటే సమూహం అని రకాలు అని కూడ అర్థం వస్తుంది.
అసలు ముప్పై మూడు కోట్ల దేవతలు అంటే అక్కడ ముప్పైమూడు మంది అని అర్థం వస్తుంది.
వారెవరంటే..
అశ్వనీ దేవతలు 2
అష్టవసువులు 8
ద్వాదశాదిత్యులు 12
ఏకాదశ రుద్రులు 11 మొత్తం ముప్పైమూడు మంది.

అశ్వనీ దేవతలు ఇద్దరు కాగా,
1.ధరుడు ..
2. ధృవుడు
3.సోముడు
4.అహుడు
5. అనిలుడు
6.అగ్ని 7.
ప్రత్యూషుడు
8.భీష్ముడు అష్ట వసువులుగా చెప్పబడుతున్నారు.

ఇక
1.శంభుడు
2.పినాకి
3 గిరీషుడు
4.స్థాణువు
5. భర్గుడు
6.శివుడు
7సదాశివుడు
8. హరుడు
9.శర్వుడు
10.కపాలి
11.భవుడు
ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు.
1.ఆర్యముడు
2. మిత్రుడు
3. వరుణుడు
4.అర్కుడు
5.భగుడు
6. ఇంద్రుడు
7. వివస్వంతుడు
8.పూషుడు
9.పర్జన్యుడు
10. త్వష్ట
11. విష్ణువు
12.అజుడు
.. ద్వాదశ ఆదిత్యులుగా చెప్పబడ్డారు. వీళ్లందరూ కలుపుకుని ముప్పై మూడుమంది దేవతలు.

*✍సనాతన హిందూ ధర్మము*

ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి టైం శ్వవచాహి విప్రాః!!

Keetah patangaah masakaascha vrikshaah
Jale stthale ye nivasanti jeevaah;
Drshtvaa pradeepam nacha janmabhaaginah
Bhavanti nityam svapachaahi vipraah.

వెలిగించి దీప శిఖలో దామోదరుణ్ణి కానీ, త్రయంబకుడిని కానీ ఆవాహన చేసి పసుపో, కుంకుమో, అక్షతలో వేయాలి. అది కార్తీక దీపం దానికి నమస్కారం చేయాలి. ఆరోజు దీపం చాలా గొప్పది. ఆ దీపపు వెలుతురు మనమీద పడినా చాలు. కీటాశ్చ - పురుగులు; మశకాశ్చ - దోమలు, ఈగలు మొదలైనవి, అంతే కాదు చెరువు ఉంది అనుకోండి అందులో రకరకాలైన పురుగులు ఉంటాయి. అవి జ్యోతి చూడగానే ఎగిరి వస్తాయి. నీటిలో ఉన్న పురుగులు, భూమిమ ఉన్నటువంటి పురుగులు ఇవన్నీ దీపం ఎక్కడ ఉందో అక్కడికి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ దీపం వెలుతురు ఎంత దూరం పడుతోందో ఈ దీపాన్ని ఏవేవి చూస్తున్నాయో ఆఖరికి చెట్లు కూడా అవన్నీ కూడా భగవంతుణ్ణి పొందుగాక! వాటికి ఉత్తరోత్తర జన్మలు తగ్గిపోవుగాక! అవి తొందరలో మనుష్య జన్మ పొంది ఈశ్వరుని అనుగ్రహాన్ని పొంది ఈశ్వర కర్మానుష్ఠానము చేసి భగవంతుణ్ణి చేరుగాక! అని శ్లోకం చెప్పి దీపం వెలిగించి నమస్కరిస్తారు. ఇది మనుష్యులు మాత్రమే చేయగలిగినటువంటి గొప్ప విశేషం. దీపపు కాంతి పడితేనే అవి అంత గొప్ప ప్రయోజనాన్ని పొందితే ఇక ఆ దీపం పెట్టిన వాడు ఎంత ప్రయోజనాన్ని పొందాలి?

నాగ దోష నివారణ,శీఘ్రముగా కళ్యాణం,సంతానం కలుగుటకు

సర్ప సూక్తమ్(రాహు కేతు అనుగ్రహ ప్రీత్యర్ధం ,నాగ దోష నివారణ,శీఘ్రముగా కళ్యాణం,సంతానం కలుగుటకు)
-------------------------------------------------------------------------------------------------------------------

బ్రహ్మ లోకేషు యే సర్పాః శేషనాగ పురోగమాః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా ఇంద్ర లోకేషు యేసర్పాః వాసుకీ ప్రముఖాదయః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా కౌద్ర వేయాశ్చ యేసర్పాః మాతృభక్తి పరాయణః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా ఇంద్ర లోకేషు యేసర్పాః తక్షక్షా ప్రముఖాదయః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా సత్య లోకేషు యేసర్పాః వాసుకి నా నురక్షితాః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా మలయే చైవ యేసర్పాః కర్కోటక ప్రముఖాదయః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా పృథివ్యాం చైవ యేసర్పః యే సాకేత నివాసినః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా గ్రామే యదివారణ్యే యే సర్పాః ప్రచరన్తిచ నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా సముద్ర తీరే యే సర్పాః యే సర్పా జలవాసినః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా రసాతలేషు యే సర్పాః అనంతాది మహాబలాః నమేస్తు తేభ్యః సర్వేభ్యః సుప్రీతాః మమ సర్వదా ఓం తత్ సత్

శ్రీ శివరక్షా స్తోత్రం - అభయంకర కవచము.

ఓం అస్యశ్రీ శివరక్షాస్తోత్ర మహామంత్రస్య
యాజ్ఞ వల్క్య ఋషిః శ్రీ సదాశివో అనుష్టుప్ ఛందః
శ్రీ సదాశివ ప్రీత్యర్ధే శ్రీ శివరక్షా స్తోత్ర జపే వినియోగః

చరితం దేవదేవస్య మహాదేవస్య పావనం
అపారం పరమామోదం మహాదేవస్య పావనం

గౌరీ వినాయకోపేతం పంచవక్త్రం త్రినేత్రకమ్
శివం ధ్యాత్వా దశభుజం శివరక్షాం పఠేన్నరః

ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ

గంగాధర శ్శిరః పాతు ఫాల మర్ధేందు శేఖరః
నయనే మదన ద్వంసీ కర్ణో సర్ప విభూషణః

ఘ్రాణం పాతు పురారాతిః ముఖం పాతు జగత్పతిః
జిహ్వం వాగీశ్వరః పాతు కంధరాం శశికంధరః

ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ

శ్రీ కంఠః పాతుమే కంఠం స్కందౌ విస్వదురంధరః
భుజౌ భూభార సంహర్తా కరౌ పాతు పినాకి ధృత్

హృదయం శంకరః పాతు జఠరం గిరిజాపతిః
నాభిం మృత్యుంజయః పాతు కటీవ్యాఘ్ర్యా జినాంబరః

ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ  

సక్ధినీ పాతు దీనార్తః శరణాగత వత్సలః
ఊరూ మహేశ్వరః పాతు జానునీ జగదీశ్వరః

జంఘే పాతు జగత్కర్తా గుల్భౌ పాతు గణాధిపః
చరణౌ కరుణాసింధుః సర్వాంగాని సదాశివః

  ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ

ఏతాం శివ బలోపేతాం రక్షాం యః సుకృతీ పఠేత్
స భుక్త్వా సకలాన్ కామాన్ శివ సాయుజ్య మాప్నుయాత్
గ్రహ భూత పిశాచాద్యా స్త్రైలోక్యే విచరంతి యే
దురా దాశుః పలాయంతే శివనామాభి రక్షణాత్

   ఓం నమశ్శివాయ  ఓం నమశ్శివాయ

అభయంకర నామేదం కవచం పార్వతీపతేః
భక్త్యా భిభర్తి యః కంఠే తస్య వశ్యం జగత్త్రయమ్
ఇమం నారాయణః స్వప్నే శివరక్షాం యథా దిశత్
ప్రాతరుత్ధాయ యోగీంద్రో యాజ్ఞవల్క్యః తథాలిఖత్
ఓం శాంతిః శాంతిః శాంతిః

ఫలం : సకలేష్టసిద్ధి జగద్వశ్యము మొ
శ్రీ యాజ్ఞవల్కౄవిరచితమ్

బొట్టు యొక్క విశిష్టత


మన సనాతన ధర్మంలో బొట్టుకు ఒక విశిష్టమైన స్థానం ఉన్నది. స్త్రీ, పురుషులు ఇద్దరికీ కూడా బొట్టు అంతే అవసరం. వాడు ఎటువంటి మార్గంలో  పయనించేవాడైనా కొంత సనాతన ధర్మాన్ని నమ్ముతాడు అంటే బొట్టు పెట్టుకుని తీరాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని విశ్వసించే వారు అందరూ కూడా బొట్టు పెట్టుకుని తీరాలి. అసలు బొట్టు రెండు కనుబొమల మధ్యలోనే పెట్టుకోవడానికి కారణం మన రెండు కనుబొమల మధ్య ఆజ్ఞ్యాచక్రం ఉంటుంది. ఆ ఆజ్ఞ్యాచక్రం మీద ఎదుటి వారి యొక్క దృష్టి పడకుండా బొట్టు పెట్టుకుంటాము. మనము తీసుకునే నిర్ణయాలన్నీకూడా ఆ ఆజ్ఞ్యాచక్రం మీదే ఆధారపడి ఉంటాయి. మనము ఏదైనా వస్తువు మర్చిపోతే భ్రుకుటి ముడి వేస్తాము. అలా భ్రుకుటి ముడి వేయడం వలన మనము మర్చిపోయిన విషయాన్ని జ్ఞ్యాపకం చేస్తుంది. కాబట్టి ఇది జ్ఞ్యాపకానికి కూడా అనుసంధానంగా ఉంటుంది. కాబట్టి బొట్టు పెట్టుకోవడం వలన పురుషుడు శౌచాన్ని పొంది ఉన్నాడు అని అర్ధం. ఒకవేళ అతను స్నానంతో వెంటనే విభూతి ధరించి నుదుట కుంకుమ ధరిస్తే అతడు ఆశీర్వదించడానికి అర్హుడు. ఒకవేళ అతను స్నానానంతరం వెంటనే కుంకుమ ధరించకుండా ఎవరినన్నా ఆశీర్వదించవలసివస్తే అతను మరల స్నానము చేసి వెంటనే కుంకుమ ధరిస్తే శౌచాన్ని పొంది ఆశీర్వదించే అర్హత వస్తుంది. అందుకనే పురుషులు స్నానం చేసిన వెంటనే విభూతి ధరించి నుదుట కుంకుమ ధరిస్తారు. మరి పురుషుడికే బొట్టు అంత పవిత్రమైతే స్త్రీకి పంచప్రాణాలు ఆ బొట్టులోనే ఉన్నాయి.

Hanuman Pooja for unemployed people.

Hanuman Pooja for unemployed people. సూర్యాంజనేయం అనగా ఏమిటి? నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తికి ఆంజనేయున్ని ఎలా ప్రార్థించాలి.
Hanuman Pooja for unemployed people.   నిరుద్యోగులు ఆంజనేయున్నిఎలా ప్రార్థించాలి.
సూర్యాంజనేయం అనగా ఏమిటి   నిరుద్యోగులు ఉద్యోగ ప్రాప్తికి ఆంజనేయున్ని ఎలా ప్రార్థించాలి.

శ్రీఆంజనేయం, ప్రసన్నాంజనేయం అనే స్తోత్రాలు చదివాం, విన్నాం కానీ ఈ సూర్యాంజనేయం అంటే? సూర్యుడు, ఆంజనేయుడికి ఉన్న సంబంధం మనం తెలుసుకోవలసిందే. వాల్మీకి రామాయణం, ఇతర పురాణాలు సూర్యుడికీ, హనుమంతుడికీ ఉన్న అనుబంధాన్ని సవివరంగా తెలియజేశాయి/ హనుమంతునికి సూర్యునితో ఉన్న అనుబంధం మరెవ్వరితోనూ కనబడడు. బాలాంజనేయుడికి సూర్యుడు ఆహారం : హనుమంతుడు బాలుడుగా ఉన్నప్పుడు ఒకసారి ఉదయభానుడిని చూసి ఆకలిగా ఉన్న బాలాంజనేయుడు ఎఱ్ఱని సూర్యబింబాన్ని పండుగా భ్రమించి ఆరగించడానికి ఆకాశానికి ఎగిరాడు. కాని ఇంద్రుని వజ్రఘాతం వల్ల అతని ప్రయత్నం విఫలమైన విషయం మనకు తెలిసిందే. దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే సూర్యుడు బాల్యంలోనే హనుమంతుని ఆకర్షించాడు. ఇది సూర్యాంజనేయుల మొదటి అనుబంధం
సూర్యశిష్యరికం : బాల్యంలోనే గాక విద్యార్థి దశకు వచ్చాక కూడా హనుమంతుని దృష్టిని సూర్యుడు ఆకర్షించాడు. తనకు తగిన గురువు సూర్యుడేనని నిర్ణయించుకొని ఆంజనేయుడు ఆయన వద్దకు వెళ్ళి నమస్కరించి విద్యనూ అర్థించాడు. నిత్యం సంచరించే తన దగ్గర విద్య నేర్చుకోవడం అంత సులభం కాదని సూర్యుడు హనుమంతునికి నచ్చజెప్పటానికి చూశాడు. కాని చివరికి హనుమంతుడి విద్యా జిజ్ఞాసను అర్థం చేసుకొని శిష్యుడిగా చేసుకోవడానికి సూర్యుడు అంగీకరించాడు. హనుమంతుడు సూర్యుని వద్ద విద్యనూ అభ్యసించిన వివిధ పురాణాలు వేరు వేరుగా చెబుతున్నాయి. ఉదయాద్రిపై ఒక పాదం, అస్తాద్రిపై ఒక పాదం ఉంచి నిత్యం సంచరించే సూర్యుని దగ్గర హనుమంతుడు వేదవేదాంగాలు, ఆరు శాస్త్రాలు, దర్శనాలు, స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, నాటకాలంకారాలు, 64 కళలు అభ్యసించాడు (గడియకు లక్షా డెబ్బై వేళ యోజనాల వేగంతో ప్రయాణించే సూర్యరథంతో సమానంగా సంచరిస్తూ హనుమంతుడు విద్యాభ్యాసం చేశాడని కొన్ని పురాణాలు చెబుతున్నాయి) జిజ్జ్వల్యమానంగా ప్రకాశించే నిత్య గమనశీలి సూర్యుని వద్ద శిష్యరికం చేసిన ఘనుడు వాయుపుత్రుడు ఒక్కడే. సూర్యుని శిష్యరికం వల్లనే శ్రీరాముని మొదటి సమగామంలోనే తన సంభాషణా చాతుర్యంతో హనుమంతుడు ఆకర్షించగలిగాడు. మైనాకుని వినయంతోను, సింహికను శక్తితోను, సురసను యుక్తితోను జయించగలగడం సూర్యుని దగ్గర నేర్చుకున్న 64 కళల ఫలితమే.
ఉద్యోగం లేనివారికి ఉద్యోగం రావడానికి...............
!! ఉద్యోగం లేనివారికి ఉద్యోగం రావడానికి, 41 రోజు ఆంజనేయ స్వామికి 108 ప్రదక్షిణలు చేసి, అలంకారానికి 4 తెల్లజిల్లేడు పూలు ఇవ్వాలి. అనంతరం తమలపాకులో తేనెను నైవేద్యంగా సమర్పించి, ఆ ప్రసాదాన్ని అక్కడే స్వీకరించాలి.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం.

హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.

గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.

అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.

అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.

ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles